ఏపీ సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తక్షణమే వివిధ శాఖల అధికారులపై బదిలీ వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్గా నియమిస్తూ విజయకుమార్రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కమిషనర్ వెంకటేశ్వర్ను బదిలీ కానున్నారు. ప్రస్తుతం విజయ్కుమార్రెడ్డి కేంద్ర సర్వీసులో ఉన్నారు.
జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఏపీటీడీసీ ఎండీగా ఉన్న ఆయన్ని పర్యాటకశాఖ నుంచి ఉపసంహరించి, కొత్త పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీచేశారు.