telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రొటెం స్పీకర్ గా అప్పలనాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రొటెం స్పీకర్ గా అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. కాసేపట్లో ఏపీ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి అప్పలనాయుడును ఎంపిక చేశారు. ఏపీ గవర్నర్ నరసింహన్ సమక్షంలో అప్పలనాయుడు ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేశారు.

మొత్తం 25 మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మరోవైపు ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిపై రేపటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు.

Related posts