తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై జగన్ది ప్రేమ కాదని, ఆ రాష్ట్రంలోని తన ఆస్తులను కాపాడుకునే ఎత్తుగడ అని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. అందుకే తన తండ్రి వైఎస్ను కేసీఆర్ తిడుతున్నప్పటికీ జగన్ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నట్లు నటిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పాదయాత్ర గురించి ఆ పార్టీ నేతలు గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.
నాలుగు ముద్దులు, సెల్ఫీలు తప్ప జగన్ పాద యాత్రలో ఏముందని ప్రశ్నించారు. రోజుకి రూ.2 కోట్లు ఖర్చుచేసి ఏడాదికి పైగా జగన్ కష్టపడినా పాదయాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదన్నారు. జగన్కు కేవలం సీఎం కుర్చీపై వ్యామోహమని ధ్వజమెత్తారు. ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాక్షసపాలన వస్తుందన్నారు. ఇప్పటికే ఎంపీ టికెట్ రూ.100 కోట్లకు, ఎమ్మెల్యే టికెట్ రూ.30 కోట్లకు వేలం పెట్టి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు: బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్రావు