ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో ఈరోజు ఉదయం టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. ఆన్లైన్ టిక్కెట్ల వ్యవహారంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, తెలుగు చిత్రపరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఆదివారం సాయంత్రం ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను కనికరించాలని.. తమ అభ్యర్థనను మన్నించాలని చిరు కోరిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.