ఆంబులెన్స్ ఆలస్యమైతే నా కారు తీసుకెళ్లండని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరిగే కలెక్టర్ల సమావేశానికి సోమవారం ఉదయం నెల్లూరు నుంచి వెళ్తుండగా మార్గమధ్యలో మేదర మెట్ల దగ్గర ఓ ప్రమాదం జరగడాన్ని మంత్రి గమనించారు. దీంతో వెంటనే తన డ్రైవర్తో చెప్పి అనిల్ కారును ఆపించారు. రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచారు. ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు.
అయితే.. అంతలోనే 108 రావడంతో మంత్రి అనుచరులు క్షతగాత్రులను ఆ వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108లో వారిని అక్కడ్నుంచి తరలించే వరకూ మంత్రి అనిల్ అక్కడే ఉండి అన్నీ చూసుకున్నారు. మంత్రి అనిల్ చేసిన ఈ మంచి పనికి పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.