ఏపీలో నిన్న మద్యం షాపులు తెరుచుకోవడంతో రాష్ట్రంలో ని అనేక షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా మద్యం ప్రియులు దుకాణాల ముందు ఓపిగ్గా ఎదురుచూశారు. అయితే, వారు భౌతికదూరం పాటించకపోవడం తీవ్ర విమర్శలపాలైంది. ఈ నేపథ్యంలో, తెనాలి సీఐ హరికృష్ణ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఆధార్ కార్డు, గొడుగు ఉంటేనే మద్యం అని స్పష్టం చేశారు.
గొడుగు ఉండడం వల్ల కచ్చితంగా ఒకరి నుంచి మరొకరు ఎడంగా ఉంటారని, దానికి తోడు ఎండ బారి నుంచి రక్షణ కూడా కలుగుతుందని తెలిపారు. ఇక, ఇతర ప్రాంతాల నుంచి కూడా మద్యం కోసం వస్తుండడంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతున్న దరిమిలా స్థానికులు, స్థానికేతరులను గుర్తించేందుకు ఆధార్ కార్డు నిబంధన తీసుకువచ్చామని సీఐ వెల్లడించారు.
ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టించింది: కన్నా