telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ఐటీ విభాగంలో ముగ్గురు సలహాదారుల నియామకం

ap logo

ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఇప్పటికే జగన్ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురిని నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి అనూప్ సింగ్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయి. దేవిరెడ్డి శ్రీనాథ్, జె.విద్యాసాగర్ రెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగా, కె.రాజశేఖర్ రెడ్డిని ఐటీ పెట్టుబడుల విభాగానికి విధాన సలహాదారుగా నియమించారు. వీరంతా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

Related posts