telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేతలకు హైకోర్టు ఝలక్.. ఎంపీ సహా 49 మందికి నోటీసులు!

ap high court

కోర్టు తీర్పులపై విమర్శలు చేయడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. జడ్జిలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలకు ఝలక్ ఇచ్చింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచితో పాటు 49 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జడ్జిలను కించపరిచారంటూ వీరిపై ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కోర్టు తీర్పులపై వారు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు పరిశీలించింది. కోర్టు తీర్పులపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టింది. అనంతరం నోటీసులను జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే.

Related posts