telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక విధానంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

నూతన ఇసుక విధానంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక రవాణా టెండర్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గనుల శాఖ శుక్రవారం అర్థరాత్రి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కిలోమీటర్ ఇసుక తరలింపునకు అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లు రద్దు చేసింది. జిల్లాకు ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించి టెండర్లను రద్దు చేసింది. జిపిఎస్ ఉన్న ట్రక్కు యజమానులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విజిలెన్స్ అధికారులతో పాటు డీజీపి కూడా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కిలోమీటరుకు రూ.4.90 ధర నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది.

Related posts