telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉమెన్స్‌ డే : విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త….

cm jagan ycp

ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా అనేక పథకాలు తీసుకువచ్చింది జగన్‌ ప్రభుత్వం. అయితే.. తాజాగా విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ల పంపిణీపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ విద్యా సంస్ధల్లో 7 నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థినులకు శానిటరీ న్యాప్ కిన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విద్యార్ధినికి నెలకు పది శానిటరీ న్యాప్ కిన్లు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి శానిటరీ న్యాప్ కిన్ల పంపిణీ పథకాన్ని అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మహిళల దినోత్సవం సందర్భంగా ఇవాళ మొబైల్‌ ఫోన్లు కొంటే 10 శాతం రాయితీ ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 

Related posts