telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఒక్క ఇంటెలిజెన్స్ తప్ప .. రాష్ట్ర పోలీసులు అందరూ సీఈసీ పరిధిలోకే వస్తారు.. జీవో

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవో జారీచేసింది. రాష్ట్ర డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను సీఈసీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సీఈసీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు సీఈసీ పరిధిలోనే పోలీసులు ఉంటారు.

ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఇంటెలిజెన్స్ డీజీకి మినహాయింపునిచ్చారు. సీఈసీ తాజా ఆదేశాలతో ప్రభుత్వ జీవోకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇదిలాఉండగా, ముగ్గురు కీలక అధికారులను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. చేసిన సీఈసీ.. తాజాగా మరో ఉత్తర్వులు జారీచేసింది.

Related posts