telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ఎస్మా యాక్ట్ ..ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్మా యాక్ట్ (అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించాలని నిశ్చయించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులను తీసుకువస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎస్మా యాక్ట్ పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది వస్తారు. అంతేకాదు, పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణా కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అత్యవసర సమయాల్లో పనిచేయని అధికారులను ఈ చట్టం ద్వారా శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

Related posts