telugu navyamedia
విద్యా వార్తలు

ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్‌ విడుదల..

అమరావతి: ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

జులై 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ ఎంసెట్‌-2022 పరీక్ష, జూలై 11, 12 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

గతంలో 136 సెంటర్లలో నిర్వహించామని, ఈ సారి అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

తెలంగాణలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

ఏప్రిల్‌ 11న ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలిపారు. ఆగష్టులో ఈఏపీ సెట్‌ ఫలితాలు, సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు.

Related posts