telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ విద్యా వార్తలు

రేపే .. ఏపీ ఈ-సెట్ .. ఆన్ లైన్ లో …

e-cet 2019 in AP is on 30th

ఏపీ ఈసెట్‌-2019 మంగళవారం జరగనుందని ఏపీ ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ భానుమూర్తి తెలిపారు. డిప్లొమా అనంతరం ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 132 సెంటర్లలో 39,734 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

ఇటీవల ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను భద్రపరిచిన కళాశాలలను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో 1,135 మంది విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను మార్చారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన విద్యార్థులకు హైదరాబాద్‌ సెంటర్‌ కేటాయించారు.

Related posts