ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఏపీ డీఎస్సీ పరీక్ష మెరిట్ జాబితాను ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో ఈరోజు విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మొత్తం 7,902 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ పరీక్షను నిర్వహించామని తెలిపారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547 మంది రాత పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు.
జిల్లాలు, సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాను రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. తొలిసారిగా మ్యూజిక్, క్రాఫ్ట్ టీచర్ల పోస్టులను భర్తీ చేశామన్నారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 136 అభ్యంతరాలను స్వీకరించామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మే నెల 15వ తేదీన నియామక పత్రాలు అందజేయనున్నట్లు గంటా పేర్కొన్నారు. ఎపికైన అభ్యర్తులకు 10 రోజుల పాటు శిక్షణ ఇస్తామని మంత్రి గంటా అన్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను http://apdsc.cgg.gov.in వెబ్ సైట్ లోచూసుకోవచ్చని తెలిపారు.
జగన్ తానేదో పెద్ద స్పెషలిస్ట్ అనుకుంటున్నాడు: తులసిరెడ్డి