ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయాక కూడా వరాల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల ప్రత్యేక డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచింది ప్రస్తుత ప్రభుత్వం. వయోపరిమితిని 54 ఏళ్లకు పెంచుతున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ప్రత్యేక డీఎస్సీ దరఖాస్తు గడువు సైతం పెంచుతున్నట్టు పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చని, ఈ నెల 16వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు సమర్పించ వచ్చని తెలిపింది.