telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విజయవాడలో ప్రేమోన్మాది ఘటనపై ఏపి డిజిపి సీరియస్

విజయవాడలో ప్రేమోన్మాది చేసిన దారుణ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఏపి డిజిపి సవాంగ్ సీరియస్ అయ్యారు. ప్రేమోన్మాది ఘాతుక ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు డిజిపి. ఇటువంటి ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కేసు సిపి స్వీయ పర్యవేక్షణలో జరిగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసామని తెలిపారు. దిశ స్ఫూర్తిగా ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు డిజిపి.

బాధితురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చిన్నారులపై, మహిళలపై దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ శాఖ ఉపేక్షించదని మరోసారి హెచ్చరించారు డిజిపి సవాంగ్. సమాజంలో జరుగుతున్న ఇటువంటి వింత పోకడలను అరికట్టాల్సిన భాద్యత మన అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీజరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు డిజిపి సవాంగ్. కాగా..ఈ ఘంటనలో దివ్య మృతి చెందగా…నాగేంద్ర చికిత్స పొందుతున్నాడు. 

Related posts