telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తాం: ఏపీ డీజీపీ సవాంగ్

apcm jagan give full powers to gowtam as dgp

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారం రోజులుగా బంధించి అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక వాపోతుంది. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపే స్పందించి, నిందితులను అరెస్టు చేసిన పోలీసులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Related posts