తిరుమలలో చలి తీవ్రత పెరగడంతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
నిన్న శ్రీవారిని 59,015 మంది భక్తులు దర్శించుకున్నారని, 19,389 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. హుండీ ఆదాయం రూ. 3.65 కోట్లు వచ్చిందని వెల్లడించారు.