telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీ సీఎస్, చంద్రబాబు భేటీ..

ap cs and cm met today on cabinet meeting

నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. రేపు కేబినెట్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రితో చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ భేటీకి అనుమతి రాకపోవడంతో ఏం చేయాలన్న విషయమై చంద్రబాబు సీఎస్ తో సమాలోచనలు జరిపారు.

ఈ సమావేశం దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగింది. అనంతరం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి బయలుదేరారు. ఈరోజు సాయంత్రానికల్లా మంత్రిమండలి సమావేశంపై ఈసీ నుంచి అనుమతి వచ్చే అవకాశముందని ఉన్నతాధికారులు సీఎంకు చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఈసీ నుంచి అనుమతి వస్తుందా? లేదా? అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.

Related posts