telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో తగ్గిన కరోనా కేసులు…

corona vairus

ఆంధ్రప్రదేశ్ కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. అయితే ఇప్పటికే ఏపీలో 8.67 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 381 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,064 కి చేరింది. ఇందులో 8,53,232 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 7840 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 4 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,992 కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 21, చిత్తూరులో 31, తూర్పుగోదావరి జిల్లాలో 45, గుంటూరులో 35, కడపలో 26, కృష్ణాలో 70, కర్నూలులో 12, నెల్లూరులో 19, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 11, విజయనగరంలో 20, పశ్చిమ గోదావరిలో 74 కేసులు నమోదయ్యాయి.

Related posts