telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ లో తగ్గని కరోనా ఉధృతి… ఈ రోజు ఎన్ని కేసులంటే..?

Corona

ఏపీ లో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఏపి ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 3503 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య  7,86,658 కి చేరింది.  ఇందులో 33396 కేసులు యాక్టివ్ గా ఉంటె, 7,46,781 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 28 మంది మృతి చెందారు.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6,481 కి చేరింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే… అనంతపురం లో 123, చిత్తూరులో 459, తూర్పుగోదావరి జిల్లాలో 457, గుంటూరులో 387, కడపలో 190, కృష్ణాలో 398, కర్నూలులో 48, నెల్లూరులో 182, ప్రకాశంలో 308, శ్రీకాకుళంలో 94, విశాఖపట్నంలో 240, విజయనగరంలో 93, పశ్చిమ గోదావరిలో 524 కేసులు నమోదయ్యాయి. 

Related posts