ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ఉండవల్లి కలెక్టర్ల సదస్సులో జగన్ మాట్లాడుతూ అవినీతికి, అక్రమాలకు, దోపిడీకి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎవైరైనా అవినీతికి పాల్పడితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి మద్దతు ఉండదని స్పష్టం చేశారు.
తప్పు చేసిన వారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పని చేయాలని చెప్పారు. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించాలని పార్టీ నేతలకు సూచించారు.