ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. తన చిన్న కుమార్తె వర్షా రెడ్డిని ఉన్నత విద్య కోసం అమెరికాలోని ఓ విద్యాసంస్థలో చేర్పించనున్నారు. కుమార్తె అడ్మిషన్ ప్రక్రియ కోసం జగన్ తన కుటుంబంతో కలిసి ఈ రాత్రికి అమెరికా వెళుతున్నారు. రాత్రి 9.30 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి అమెరికా బయల్దేరనున్నారు. ఎల్లుండి డల్లాస్ లో జరిగే ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో జగన్ పాల్గొంటారు. ఆపై అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఆనంతరం ఈ నెల 24న జగన్ రాష్ట్రానికి తిరిగి వస్తారు.
previous post