telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎయిర్ పోర్ట్ నుంచి పార్లమెంటు.. మెట్రోలో ప్రయాణించిన జగన్

jagan

లోక్‌సభతోపాటు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి (జమిలి) ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన జగన్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పార్లమెంటు వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు.

మోదీ అధ్యక్షతన పార్లమెంటు భవనంలోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

Related posts