లోక్సభతోపాటు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి (జమిలి) ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన జగన్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పార్లమెంటు వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు.
మోదీ అధ్యక్షతన పార్లమెంటు భవనంలోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.