telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రత్యేక హెలికాప్టర్ లో కాళేశ్వరం బయలుదేరిన జగన్

jagan

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నేడు ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డకు ఆయన బయలుదేరారు.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ భూపాలపల్లికి చేరుకున్నారు. మరికాసేపట్లో మేడిగడ్డ వద్దకు ఆయన వెళ్లనున్నారు. ఆపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సైతం అక్కడికి చేరుకోనుండగా, కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తరువాత, కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు.

Related posts