telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తిరుపతి బయలుదేరిన సీఎం జగన్‌

అమ‌రావ‌తి నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి బయల్దేరారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకోనున్నారు. భారత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్ రెండు రోజుల తిరుమల పర్యటన సంధర్బంగా ఈరోజుసాయంత్రం తిరుమల చేరుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు సీఎం జగన్ తిరుపతికి వెళ్లారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే గవర్నర్ నరసింహన్ తిరుపతి చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.

రాష్ట్రపతి స్వామి వారిని దర్శించుకొని మ్రొక్కులు‌ చెల్లించుకుంటారు. రాత్రి తిరుమల శ్రీపద్మావతి అతిధి గృహం చేరుకుని బస చేస్తారు. ఇందుకోసం ఆయా విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ తిరుమల ప్ర‌త్యేకాధికారి ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. టీటీడీ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని రాష్ట్ర‌ప‌తి తిరుమలకు చేరుకుని తిరిగి వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

Related posts