తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ శనివారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనవసరపు ఖర్చులు తగ్గించేలా బడ్జెట్ ఉండాలని ఆర్థిక అధికారులకు, ఆర్థిక శాఖమంత్రికి జగన్ సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్లో నవరత్నాలకు నిధుల సమీకరణ, కేటాయింపుపైనే ముఖ్యంగా చర్చించారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, రాష్ట్రంలో ఆదాయ వనరుల పెంపుపై ప్రధానంగా దృష్టి సారించాలని ఉన్నాధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఆదాయ వనరులు పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులకు జగన్ సూచించారు.