ఏపీ సీఎం జగన్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యే విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించారు. గతంలో హైకోర్టు జగన్ మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసినందున మళ్లీ ఇప్పుడు ఎలా విచారణ చేపడతామని కోర్టు ప్రశ్నించింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో విచారణ చేపట్టవచ్చని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు సూచించారు.
రాష్ట్రముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉన్నందున తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరిన సంగతి తెలిసిందే. అయితే తనకు బదులు తన తరపున తన న్యాయవాది హాజరయ్యేలా అనుమతి మంజూరు చేయాలని పిటీషన్లో జగన్ కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.
ఇండియా, చైనాలు వర్ధమాన దేశాలు కాదు: ట్రంప్