telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం హోదాలో తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేసిన జగన్

machilipatnam as ntr district by jagan

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ తొలిసారిగా సీఎం హోదాలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు.

అనంతరం ఓపెన్ టాప్ పై అధికారులకు, ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జగన్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 13 శాఖల శకటాల విన్యాసాలు ప్రజలను అలరించాయి. స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Related posts