ఢిల్లీ సదస్సులో పాల్గొని వచ్చిన వాళ్లతోనే కరోనా వైరస్ విస్తరిస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. బుధవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ గత రెండు రోజలుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడంతో పాటు వారికి చికిత్స అందించే వరకు సమగ్ర విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు.
ఢిల్లీకి వెళ్లిన వారిని, వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.కరోనా కూడా మిగతా ఫ్లూ, జ్వరాల లాంటిదే అని సీఎం అన్నారు. కాకపోతే ఎక్కువ వయసున్న వారిలో.. బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవారిపై తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పారు. అందువల్ల ఎవరూ అధైర్య పడొద్దని విజ్ఞప్తి చేశారు.
కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు