ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్నారు. గత రెండు నెలలుగా ఎన్నికల ప్రచారంలో ఎంతో బిజీగా గడిపిన ఆయన, ఒకటి, రెండు సందర్భాల్లో మాత్రమే హైదరాబాద్ కు వచ్చి వెళ్లారు. నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత తిరిగి ఆయన అమరావతికి బయలుదేరుతారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
మరో వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రస్తుతం నియోజకవర్గాల అభ్యర్థులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ బిజిగా గడుపుతున్నారు. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచిస్తూ, దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు.