ఏపీలో ఎన్నికలపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు వాటన్నింటిని రద్దు చేసుకున్నారు. రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం గుంటూరు జిల్లా నుంచి హెలికాప్టర్ లో రామోజీ ఫిలింసిటీకి చేరుకున్న చంద్రబాబు రామోజీరావుతో బుధవారం భేటీ అయ్యారు.
ఫిల్మ్ సిటీలోనే జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన రామోజీరావును కలిశారు. వీరిద్దరూ కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో పోలింగ్ సరళి, వివిధ సంస్థలు ఇస్తున్న సర్వేలు, జాతీయ రాజకీయాలపై రామోజీరావుతో చర్చించినట్లు సమాచారం.