telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

సెక్రటేరియట్ కు రావచ్చు.. సమీక్షలు నిర్వహించవచ్చు: ద్వివేది

election commissioner faced evm issue
ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు కూడా సెక్రటేరియట్ కు రావచ్చని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కొన్ని సమీక్షలను కూడా ముఖ్యమంత్రి నిర్వహించవచ్చని అన్నారు. పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల్లో  ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనే విషయం స్పష్టంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు వారివారి కార్యాలయాల్లో కూర్చోవచ్చని, అయితే రాజకీయపరమైన పనులను మాత్రం చేపట్టకూడదని తెలిపారు
ముఖ్యమంత్రి సమీక్షలపై తమకు వైసీపీ ఫిర్యాదు చేసిందని, దీనిపై సీఎస్ ద్వారా సంబంధింత అధికారుల నుంచి నివేదిక కోరుతామని తెలిపారు. వారి నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని ద్వివేది చెప్పారు. ఈ నెల 10వ తేదీన చంద్రబాబు తమ కార్యాలయానికి వచ్చి మాట్లాడిన అంశాలను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిందని తెలిపారు. సీఈసీ కోరిక మేరకు సీఎం మాట్లాడిన మాటలపై  నివేదిక పంపామని తెలిపారు.

Related posts