ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైంది. కరువు, తాగు నీటి సమస్య, ‘ఫణి’ తుపాన్ , ఉపాధి పనులకు నిధుల చెల్లింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. వీటికి సంబంధించిన సాధారణ నిర్ణయాలు ఏమైనా తీసుకోవచ్చునని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
కొత్త నిర్ణయాలు గానీ, రేట్ల సవరణగానీ, పెద్ద మొత్తంలో బకాయిలు చెల్పింపులు గానీ చేయాల్సి వస్తే అందుకు తమ అనుమతి తప్పనిసరని కమిషన్ స్పష్టం చేసింది. ఈ భేటీకి రాష్ట్ర మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులు హాజరయ్యారు. మంత్రులు పితాని సత్యనారాయణ, ఆదినారాయణరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు హాజరుకాలేదు.