ఏపీ సీఎం వైస్ జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన “అమ్మ ఒడి” పథకానికి కేటినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల, ల్యాబ్లో పరీక్షించి రైతులకు అందజేయాలని కేబినెట్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రెట్టింపు పోషకాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 77 మండలాల్ల రూ.90 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కేటినెట్ నిర్ణయం తీసుకుంది.
విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రాజకీయం: వీహెచ్