telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. కేటాయింపులు ఇవే!

ap ministers meet to accept budget

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ఈరోజు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ సందర్భంగా.. మొదట ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో నిరుపేదల కన్నీటిని తుడిచేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు. ప్రతీ గ్రామానికి రక్షిత మంచినీరును అందిస్తామని అన్నారు. కృష్ణా నది ఆయకట్టు స్థిరీకరణ, ఏపీకి ప్రత్యేకహోదా లక్ష్యంగానే ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వేర్వేరు రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపులను మంత్రి ప్రకటించారు.

బడ్జెట్‌ లో కేటాయింపులు:
అమ్మఒడి పథకానికి రూ.6,455 కోట్ల కేటాయింపు
విద్యారంగానికి అధిక ప్రాధాన్యత.. రూ.32,618 కోట్ల కేటాయింపు
ఏపీలోని దివ్యాంగులకు పెన్షన్ల కోసం రూ.2,133.62 కోట్లు
ఒంటరి మహిళలకు పెన్షన్ల కోసం మరో రూ.300 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు
పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,500 కోట్లు,
నిర్వహణ గ్రాంటు కింద రూ.160 కోట్లు కేటాయింపు
మధ్యాహ్న భోజన పథకానికి రూ.1,077 కోట్లు

విద్యుత్ రంగానికి రూ.6,860 కోట్లు కేటాయింపు
వైద్య రంగానికి రూ.11,399 కోట్లు
పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,564.75 కోట్లు
ఏపీ రెవెన్యూ శాఖకు రూ.9,496.93 కోట్లు
గృహనిర్మాణం కోసం రూ.3,617 కోట్లు
ఏపీలో సంక్షేమ రంగానికి రూ.14,142 కోట్లు
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,740 కోట్లు కేటాయింపు
ఆశావర్కర్ల వేతనాల కోసం రూ.455.75 కోట్లు
ఏపీఎస్ ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయింపు

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,140 కోట్లు
వైఎస్సార్ గృహవసతి పథకానికి రూ.5,000 కోట్లు
దళితుల అభివృద్ధికి రూ.15,000 కోట్లు
గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు
బీసీల అభివృద్ధికి రూ.1561 కోట్లు కేటాయింపు
గ్రామ సచివాలయాల నిర్వహణకు రూ.700 కోట్లు
మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ.280 కోట్లు
న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100 కోట్లు
కొత్తగా ప్రాక్టీసు పెట్టుకునే లాయర్ల సంక్షేమానికి రూ.10 కోట్లు
నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీల సంక్షేమానికి రూ.300 కోట్లు

చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.200 కోట్ల మంజూరు
ధార్మిక సంస్థల అభివృద్ధికి రూ.234 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కు రూ.100 కోట్లు
మెడికల్ భవనాల నిర్మాణానికి రూ.68 కోట్లు కేటాయింపు
వైఎస్సార్ గిరిజన వైద్యకళాశాల ఏర్పాటుకు రూ.66 కోట్లు
గురజాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రూ.66 కోట్లు
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.66 కోట్లు
శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం.. రూ.50 కోట్లు కేటాయింపు

పట్టణాల్లోని స్వయం సహాయక బృందాలకు రూ.648 కోట్ల వడ్డీలేని రుణం
ఏపీ కేన్సర్ నివారణ ఆసుపత్రికి రూ.43 కోట్లు
మసీదుల్లో ఇమామ్ కు నెలకు రూ.10 వేలు, మౌజన్ కు రూ.5 వేల గౌరవవేతనం అందించాలని నిర్ణయం
అలాగే పాస్టర్లకు నెలకు రూ.5 వేలు గౌరవవేతనం చెల్లించాలని నిర్ణయించారు
దేవాలయ ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డులపనుల్లో బీసీ, ఎస్టీ,ఎస్టీలకు 50 శాతం 
ఇందుకోసం చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయం
కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం రూ.2,000 కోట్ల కేటాయింపు

Related posts