ఇసుక విధానంపై ఏపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఇసుకపై నిషేధం విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్ వైఖరి సరికాదని విమర్శించారు.
హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పినా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తెచ్చిన గ్రామ సచివాలయ విధానంతో అనేక మందికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామని ఆమె పేర్కొన్నారు.
ఎంపీటీసీ గెలవని పంచాయతీలకు నిధులు రావు : వైసీపీ ఎమ్మెల్యే