telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మోడీ సంగతేమోగానీ, కన్నాకే విమానాశ్రయంలో .. నో ఎంట్రీ.. గవర్నర్ పడిగాపులు..

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత నాలుగున్నరేళ్లలో ఏమేం చేశామో చెప్పడానికి బీజేపీ గుంటూరులో ‘ప్రజా చైతన్య సభ’ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టుకు వెళ్లిన బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు తీవ్ర అవమానం ఎదురైంది.

జాబితాలో కన్నా పేరు లేదంటూ విమానాశ్రయంలోకి ఆయనను పంపడానికి ఏపీ పోలీసులు నిరాకరించారు. దీనితో కన్నా స్పందిస్తూ..‘నేను మోదీ గారితో కలిసి హెలికాప్టర్ లో గుంటూరుకు వెళ్లాల్సి ఉంది. దయచేసి అనుమతించండి’ అని కోరినా అధికారులు అంగీకరించలేదు. ఈ ఘటనపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా బీజేపీ శ్రేణులు గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మోదీని ఆహ్వానించడానికి గన్నవరం విమానాశ్రయానికి గవర్నర్ నరసింహన్ చేరుకున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు.

Related posts