telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు : సభ ముందు కీలక బిల్లులు

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలు. సభ ప్రారంభం కాగానే… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో సహా పలువురికి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అసెంబ్లీలో తొలి రోజు వ్యవసాయ రంగం, నివర్ తుఫాన్ ప్రభావం పై చర్చించనుంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. యానిమల్ ఫీడ్, ఫిష్ ఫీడ్ యాక్ట్, ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్, ఏపీ ఫిషరీష్ యూనివర్సిటీ బిల్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసైన్డ్ భూముల చట్ట సవరణ, అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్, ఏపీ వ్యాట్ బిల్, ఏపీ టాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్ సవరణ బిల్, ఏపీ స్పెషల్ కోర్ట్స్ ఫర్ వుమెన్ , మోటార్ వెహికల్ చట్టం, ఆన్ లైన్ గేమింగ్ నిషేధిత చట్టం, ఏపీ ఎఫ్ ఆర్ బి ఎం సవరణ బిల్లు, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు, మున్సిపల్ లా సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ రాజ్ చట్ట సవరణ, 20 ప్రధాన అంశాలను చర్చించనుంది జగన్‌ ప్రభుత్వం. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతీ అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

 

Related posts