ఈనెల 12 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో ఈ నెల 12 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 13న కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, 14న ఉభయ సభల సంయుక్త సమావేశం, శాసనసభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
శాసనమండలి సమావేశాలు ఈనెల 14 నుంచి మొదలుకానున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో జగన్..ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్..విప్లను సైతం అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, స్పీకర్ పదవి ఎవరికి వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.