telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మందు బ్రాండ్లు నీకెందుకురా తల్లి.. ఆ విషయం వాళ్లు మాట్లాడతారు: తమ్మినేని

bhavani tdp mla assembly

ఏపీ అసెంబ్లీలో సమావేశాల్లో రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మందు బ్రాండ్ల పై ప్రస్తావించారు. తాగుబోతుల చేష్టలతో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వైన్ షాపు, బార్లను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. కమిషన్ తీసుకుని ప్రభుత్వం కొన్ని రకాల మందు బ్రాండ్లను మాత్రమే వైన్ షాపుల్లో ఉంచుతుందని చెప్పడానికి భవానీ ప్రయత్నించారు.

అయితే మహిళ ఎమ్మెల్యే మందు బ్రాండ్ల ప్రస్తావన తేవడంతో తోటి ఎమ్మెల్యేలు నవ్వు ఆపుకోలేకపోయారు. తోటి సభ్యులు ముసిముసి నవ్వులు నవ్వుతుండగా.. ఆమె కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. అది గమనించి స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకుని ‘నీకెందుకురా తల్లి ఆ బ్రాండ్ల విషయం వాళ్లు మాట్లాడతారు వదిలేయ్’ అని అన్నారు.

Related posts