ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉన్నతాధికారుల బదిలీలతో పాటు కీలక పోస్టుల్లో నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే డీజీపీతో పాటు ఆయా శాఖల ఉన్నాతాధికారుల నియామకం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రానికి కొత్త అడ్వొకేట్ జనరల్ గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు.
శ్రీరామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గత ప్రభుత్వానికి చెందిన అనేక కేసులను ఆయన సమర్థంగా వాదించారు. అందుకోసమే ఆయనను జగన్ అడ్వొకేట్ జనరల్ గా తీసుకునట్టు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం: రవితేజ