telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గుణశేఖర్ “శాకుంతలం”లో అనుష్క ?

Anushka

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ అంటే భారీ బడ్జెట్ చిత్రాలను, క‌ళ్లు చెదిరే సెట్స్‌తో అద్భుతంగా తెర‌కెక్కించే ఆయన ప్రతిభ కన్పిస్తుంది. గుణశేఖర్ తాజాగా తన తర్వాత చిత్రం ‘శాంకుతలం’ అని ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటించనున్నారట. మొదట ఈ పాత్రకు గానూ పూజా హెగ్డేను సంప్రదించారని, ఆమె అంత ఆసక్తిని చూపలేదని టాక్. ఆ తరువాత అనుష్కను సంప్రదించారట ఆమె ఓకే చెప్పారని సమాచారం. గతంలో అనుష్క, గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవిలో నటించారు. ఈ క్రమంలో గుణశేఖర్ పని గురించి బాగా తెలిసిన అనుష్క, ఇప్పుడు శాకుంతలంకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మూవీకి దేవసేన ప్రధానాకర్షణగా మారనున్నారు. ఇక దాదాపు ఐదు సంవత్సరాల గ్యాప్ తరువాత టాలెంటెడ్‌ డైరెక్టర్ గుణశేఖర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. హిరణ్యకశ్యప కంటే ముందు తెరకెక్కిస్తున్నట్లు గుణశేఖర్ తెలిపారు. మహాభారత ‘ఆదిపర్వం’లోని ఓ ప్రేమకథాంశంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఈ ప్రకటన వచ్చిన తరువాత శాకుంతలంపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

Related posts