telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వివాదంలో చిక్కుకున్న అనుష్క… లీగల్ నోటీసులు

anushka

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ లాక్ డౌన్ వేళ చిక్కుల్లో పడింది. తాజాగా ఆమెకు లీగల్ నోటీసులు అందినట్టు తెలుస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 18న విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా థియేటర్స్ అన్నీ మూతపడటంతో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లకు‌ డిమాండ్ పెరిగింది. దాన్ని క్యాచ్ చేసుకుంటూ పలువురు దర్శకనిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనుష్క శర్మ సహ నిర్మాతగా రిలీజైన `ప‌తాల్ లోక్‌` వెబ్ సిరీస్ ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ వెబ్ సిరీస్‌లోని రెండ‌వ ఎపిసోడ్‌లో నేపాలీల‌ను కించ‌ప‌రిచేవిధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని పేర్కొంటూ నేపాల్‌కి చెందిన గోర్ఖా క‌మ్మూనిటీ ఫిర్యాదు చేసింది. దీంతో `ప‌తాల్ లోక్‌` యూనిట్‌తో పాటు అనుష్క శర్మకు కూడా లీగ‌ల్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దీనిపై అనుష్క ఇంకా స్పందించలేదు.

Related posts