తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నటించిన అనుపమ పరమేశ్వరన్ కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరారు. ఎప్పుడూ దక్షిణ సంప్రాదాయ దుస్తుల్లో ఉండే అనుపమ ఈ మధ్య కాస్తా జీన్స్, టిషర్ట్స్ ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోలు చూసిన అనుపమ ఇవి తను పోస్టు చేస్తున్నవి కాదని, ఎవరో తన ఫేస్బుక్ను హ్యాక్ చేశారని వెల్లడించారు. ‘కొంత మంది వెధవలు నా ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశారు. కాస్తా అప్రమత్తంగా ఉండాలని సమాచారం ఇస్తున్న అంతే’ అనే క్యాప్షన్తో తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీనికి తన ఫేస్తో మార్ఫింగ్ చేసిన ఫొటోలను ట్యాగ్ చేసి పోస్టు చేశారు. ఇక ఇలాంటి వెధవ పనులకు సమయం కేటాయించే హ్యాకర్స్పై విరుచుకుపడ్డారు. ‘’మీకు ఇంట్లో అమ్మ, అక్కాచెల్లెల్లు లేరా. మీ మెదడును కొంచం ఉపయోగపడే మంచి పనులకు వాడండి. ఇలాంటి చెత్త పనులకు కాదు’’ అంటూ మండిపడ్డారు. ఇక అనుపమకు ఇన్స్టాగ్రామ్లో 6.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కాగా ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రాక్షసుడులో హీరోయిన్గా నటించారు.