telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

మ‌ల్‌హాస‌న్ కు ముంద‌స్తు బెయిల్ మంజూరు

Kamala Hasan Stop Doing the Films

భార‌త‌దేశ‌పు తొలి ఉగ్ర‌వాది నాథూరామ్ గాడ్సే అని క‌మ‌ల్‌హాస‌న్ చేసిన వ్యాఖ్య‌లు దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే. త‌మిళ‌నాడులోని అర‌వ‌కురుచ్చి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌ల కోసం ప్ర‌చారం చేస్తూ క‌మ‌ల్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిందూ అతివాదులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కారూర్ జిల్లాలోని అర‌వ‌కుచ్చి పోలీసులు క‌మ‌ల్‌పై 153ఏ, 295ఏ కింద కేసుల‌ను న‌మోదు చేశారు. ఆ కేసులో ఈరోజు మ‌ద్రాసు హైకోర్టుకు చెందిన మ‌ధురై బెంచ్ క‌మ‌ల్‌కు ముంద‌స్తు బెయిల్‌ను మంజూరీ చేసింది.

మ‌త‌విద్వేషాలు రెచ్చగొడుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదు అయ్యింది. త‌న‌కు ఉన్న మంచి పేరును చెడ‌గొడుతున్నార‌ని క‌మ‌ల్ అన్నారు. మ‌హాత్ముడిని చంపిన గాడ్సేనే త‌న పుస్త‌కంలో గాంధీని ఎందుకు చంపాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని చెప్పాడ‌ని క‌మ‌ల్ పోలీసులకు తెలిపారు. తాను హిందువున‌ని, దేశాన్ని విభ‌జించినందుకు గాంధీని హ‌త‌మార్చిన‌ట్లు గాడ్సేనే పుస్త‌కంలో పేర్కొన్నాడ‌ని క‌మ‌ల్ చెప్పారు.

Related posts