రోజురోజుకు మహర్షి చిత్రంపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తుంది యూనిట్. తాజాగా, పాల పిట్టలో వలపు.. నీ పైట మెట్టుపై వాలిందే ..’ అనే పాట విడుదల చేసింది. ఈ పాటకు అందంగా స్టెప్పులేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ మూవీకోసం ఈ హీరో ఇలా హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి డ్యాన్సుల్లో మునిగి తేలాడు.
సినిమాలోని ఈ సాంగ్ ను యూనిట్ సోమవారం విడుదల చేసింది. రాహుల్ సిప్లి గంజ్, ఎం.ఎం.మానసి పాడిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మే 9న ఈ సినిమా రిలీజవుతోంది.
కత్రినాకు నేను మేరీ జాన్… సల్మాన్ వ్యాఖ్యలు