ప్రస్తుతం మన దేశంలో కరోనా మనుషులను వణికిస్తుంటే తమిళనాడులో మాత్రం జంతువులను కూడా భయపెడుతుంది. కరోనాతో మరో సింహం మృతి చెందింది. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల మూడో తేదినా నీలా అనే తొమ్మిది సంవత్సరాల ఆడ సింహం మృతి చెందగా.. జూన్ 16 న పద్మనాధన్ అనే 12 ఏళ్ళ సింహం మృతి చెందింది. మొత్తం 11 సింహాలలో 9 సింహాలను కరోనా పాజిటివ్ సోకింది. వాటిలో నాలుగు సింహాలకు డెల్టా వేరియంట్ వైరస్ సోకినట్లు భూపాల్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసిసస్ నిర్ధారించింది. ఇక లాక్ డౌన్ కారణంగా గత నెల రోజుల జూ మూసి ఉంది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది.
previous post
సెట్లో చిరాగ్గా… అయినా తప్పదు : జాన్వీ కపూర్