చిత్తురు జిల్లా మదనపల్లెలో మరో ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఫేస్ బుక్ ద్వారా బాలికకు దగ్గరై ప్రేమ పేరుతో పలుమార్లు లైంగిక దాడి చేసాడు ప్రైవేటు ఉపాధ్యాయుడు దినేష్. ఎవరికైనా లైంగిక దాడి విషయం చెబితే ఆత్యహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. వేదింపులు ఎక్కవ కావడం పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక. దీంతో దినేష్ పై పోక్స్ చట్టం కిందా కేసు నమోదు,అరెస్టు చేసారు మదనపల్లె పోలీసులు.
ఇది ఇలా ఉండగా మదనపల్లిలో కొన్ని నెలల క్రితం జంట హత్యలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కన్న కూతుళ్లను తల్లిదండ్రులు మూడ నమ్మకాలు పేరుతో పొట్టన పెట్టుకున్నారు.